Wednesday, May 15, 2024

కేసీఆర్ కోలుకొని మళ్ళీ ప్రజా సేవకు రావాలి.. చంద్రబాబు

spot_img

హైదరాబాద్: సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు వారాలు పడుతుందని వైద్యులు చెప్పారని తెలిపారు. ఆయన కోలుకొని మళ్ళీ ప్రజా సేవకు రావాలని ఆకాంక్షించారు. జీవితంలో ఒడిదుడుకులు రావటం సహజమని, కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్లు కూడా ఆపరేషన్ బాగా చేశారని ప్రశంసించారు. ప్రజలకు కేసీఆర్ మళ్ళీ సేవ చేయాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read.. అధికార పార్టీలు మారినంత మాత్రాన శిలాఫలకాలు తొలగిస్తారా?

Latest News

More Articles