Sunday, April 28, 2024

కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి వస్తారు

spot_img

హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్  సోమవారం రోజున యశోద ఆస్పత్రిలో పరామర్శించారు.  అనంతరం ఆజాద్ మాట్లాడుతూ…. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ ను చూస్తున్నానని, ప్రస్తుతం ఈ స్థితిలో కేసీఆర్ చూడడం బాధాకరమని అన్నారు.

Also Read.. చింతపల్లి ఎస్‌ఐ సతీష్ రెడ్డి సస్పెండ్

కేసీఆర్ వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కేసీఆర్ అతిత్వరగా కోలుకొని తెలంగాణకు సేవ చేస్తారన్న విశ్వాసం ఉందని స్పష్టం చేశారు.  భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ వెంట తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ ఉన్నారు. అంతకుముందు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు.

Latest News

More Articles