Sunday, April 28, 2024

అధికార పార్టీలు మారినంత మాత్రాన శిలాఫలకాలు తొలగిస్తారా?

spot_img

హైదరాబాద్‌ : ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను గొప్ప ఆలోచనలతో నిర్మించినట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌ చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని సూచించారు.

అచ్చంపేట నియోజకవర్గక క్యాంపు కార్యాలయంలోని శిలాఫలకాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. సోమవారం ఆయన బీఆర్‌ఎస్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలని సూచించారు.

అధికార పార్టీలు మారినంత మాత్రాన శిలాఫలకాలు తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే సమర్ధిస్తామని, అదే సమయంలో చెడు చేస్తే విమర్శిస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ ఏర్పడిందే తెలంగాణ కోసమని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

Latest News

More Articles