ఛత్తీస్ గఢ్: సుకుమా జిల్లా దబ్బమరక సిఆర్పిఎఫ్ క్యాంప్, సలాతోంగ మార్గం మధ్యలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. రోడ్డు నిర్మాణ పనులకు రక్షణగా వెళుతున్న పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందు పాతర పేల్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా, వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.