శ్రీశైలంలోని రుద్రా పార్క్ వద్ద మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. కొందరు భక్తులు చిరుతను తమ ఫోన్లలో బంధించారు. 10 రోజుల క్రితం శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద కూడా చిరుత కనిపించి కలకలం రేపింది. చిరుత సంచారంతో భక్తులు, స్థానికులు భయపడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి చిరుత దాడి చేస్తుందోనని కంగారు పడుతున్నారు.
Crime News ఎల్బీనగర్లో విషాదం. ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం..!
ఇటీవల తిరుమలలో నడక దారిలో చిరుత పులి చిన్నారిపై దాడి చేసి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆతర్వాత టీటీడీ అధికారులు అప్రమత్తమై బోన్లను ఏర్పాటు చేసి, చిరుతలను బంధించి నడకమార్గానికి దూరంగా ఉండే అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.