Saturday, May 18, 2024

అభివృద్ధి అగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి.. 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం

spot_img

హైదరాబాద్: ‘‘24 ఏండ్ల క్రితం ఒక్కణ్ణే బయల్దేరి వెళ్ళాను..ఆనాడు కొంత మంది మిత్రులను కూర్చుండి మన బ్రతుకు ఇంతేనా అని బాధ పడేవాళ్ళం.. ఆనాడు నిస్పృహ, నిస్సహాయత ఉండేది కానీ ఎం చేయాలో తెల్వని పరిస్థితి.. ఎక్కడ చూసిన చిమ్మని చీకటి, ఎవరిని కదిలించిన మన బ్రతుకులు ఎం ఉన్నాయి అనే ఆవేదన ఉండేది.. నేను 10వ తరగతి చదువుతున్న సమయంలో మన జిల్లా కేంద్రం సంగారెడ్డి అక్కడకు పోవాలి అంటే 5,6 గంటల సమయం పట్టేది.’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గజ్వెల్ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంకు ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలోమంత్రి హరీష్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read.. కేసీఆర్ నాయ‌క‌త్వ‌మే రాష్ట్రానికి శ్రీరామ ర‌క్ష

‘‘మంజీర నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్ వేసిన నీళ్లు రాకపోయేవి. అప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే ఒక్కో బాయి కి 2 వేలు మూడు వేలు వేసుకొని మంచిగా చేయించే పరిస్థితి ఉండేది. ఎన్టీఆర్ దగ్గరకు 27 మంది ఎమ్మెల్యేల సంతకాలు చేయించుకొని వెళ్ళాను కానీ అప్పటి విద్యుత్ సంస్థల చైర్మన్ అన్ని ఒప్పుకుంటా కానీ స్లాబ్ మాత్రం చేంజ్ చేయం అని చెప్పారు. కానీ గట్టిగా పట్టిపడితే స్లాబ్ చేంజ్ చేశారు. ఆనాడు కరెంటు బిల్లు పెంచం అని చెప్పి మోసం చేశారు చంద్రబాబు.ఇక లాభం లేదని చూస్తూ చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. కొంతమందితో కలిసి ఉద్యమాన్ని శ్రీకారం చేస్తూ ముందుకు వచ్చా. నాతో ఎవరు కలిసి రాలేదు. నేను వస్తే కూడా జారుకున్నారు. చివరికి తెలంగాణ సాధించుకున్నాం.

Also Read.. 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి పనులు.. 10 ఏండ్లలో పూర్తిచేశాం

గజ్వెల్ కు కావల్సింది చాలా ఉంది.లీడర్లు ఇదే చాలు అని ఉరుకోవద్దు.ఇంకా కావాలని పట్టుపట్టాలి. ఊర్లలోకి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. ఊర్లో మోటర్ లేదు కానీ నీళ్లు వస్తున్నాయి. ఊర్లో మోటర్ లేదు…సంపూ లేదు నీళ్లు మాత్రం వస్తున్నాయి. దీనికి ప్రేరణ ఏంది అంటే సిద్దిపేట ఎమ్మెల్యే గా నేను ఉన్న అప్పుడు సిద్దిపేట లో భయంకరమైన కరువు ఉండే అప్పుడు ఆలోచన చేసి మిడ్ మానేరు నుండి ఎత్తైన గుట్టపైకి నీళ్లు సప్లై చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చాము.ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నాం.

ఆనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసిన బిందెలతో ప్రదర్శనలు ఉండే ఇప్పుడు ఎక్కడ అలాంటి పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చిన రోజు చెట్టుకు ఒక్కరూ గుట్టకు ఒక్కరు అయ్యారు. మహబూబ్ నగర్ తోపాటు మన మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉండేది. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి జరిగితే వలసలు అగుతాయి అని ఆలోచన చేశాం. ఇప్పుడు వలసలు వాపసు వచ్చి అద్భుతమైన వ్యవసాయ రంగం పురోగమించింది. అన్నపూర్ణ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. వీటన్నింటి నుండి బయటకు రావాలి అంటే ఎలా అని ఆ దుఃఖం నుండి బయటకు ఎలా రావాలి అని ఎంతో ఆలోచన చేశాము. ఎంతో మంది ఆర్ధిక, వ్యవసాయ రంగం నిపుణులతో మాట్లాడం.అప్పుడే వ్యవసాయ స్థిరీకరణ జరిగింది.

Also Read.. రేవంత్‌ రెడ్డి తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుంది

నేను ఒక్కసారే ఒడిపోయాను. అప్పుడు కూడా నేను పొడిపోలేదు ఓడించబడ్డాను. అప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్ లు లేకుండే ..బ్యాలెట్ పేపర్ ఉండే 6 ఓట్లతో ఓడించారు. గజ్వెల్ బిడ్డలు నన్ను కడుపులో పెట్టుకొని గెలిపించారు. ఒక్కసారి రెండు సార్లు గెలిపించారు. అయితే కొంత చేశాము గజ్వెల్ కు ఇంకా చేయాలి. కరోనా తో కొంత ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయి. రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించాయి. నాకు కూడా కరోనా వచ్చింది. కరోనా అట్లా నాట ఇట్లా నాట అని భయంకర వార్తలు రాశారు మీడియా,పేపర్ వాళ్ళు.

పదవులు వస్తాయి పోతాయి ఉన్నప్పుడు ఎం చేశారు అనేది ముఖ్యం. రైతాంగం పంటలు పండించాలి. ఎన్నికల తరువాత ఒక్కరోజు మొత్తం గజ్వెల్ నియోజక వర్గం ప్రజలతో గడుపుతా. భూములు పోయిన భాధ చాలా పెద్దది. నాకు కూడా భాధ ఉంది నాది కూడా భూమి పోయింది. మా అత్తగారి ఊర్లో నా అత్తగారి భూమి,నా ఊర్లో భూమి కూడా పోయింది. మీరు ఇవాళ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోయారు. మీకు ఇవాళ యావత్ రైతాంగం ఋణపడి ఉంటుంది.

Also Read.. పట్నం మాస్టర్ ప్లాన్.. 2018 రేవంత్ సీన్ రిపీట్ కానుందా ?

ఇండియా లో భూగర్భ జలాలు తగ్గిపోతే తెలంగాణ లో మాత్రం భూగర్భ జలాలు పెరిగాయి. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ తోనే సాధ్యం అయింది. మొదటి దశలో ప్రాజెక్టు కట్టుకున్నాం.అయిన కాంగ్రెస్ వాళ్లు,కోదండరాం లాంటి వాళ్ళు అడ్డుకున్నారు. రెండో దశలో మరింత అభివృద్ధి చేసుకోవాలి. రెండో దశలో ప్రతి గ్రామానికి నీళ్లు ఇచుకుందాం. గజ్వెల్ లో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టు లు నిర్మాణం చేసుకున్నాము.

మనం గెలుచుడు కాదు పక్కన ఉన్న 3 నియోజకవర్గాలను గెలిపించాలని కోరుతున్న. అభివృద్ధి అగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి, గెలుస్తుంది. గెలుస్తున్నాం నాకు డౌట్ లేదు 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం. నేను కామారెడ్డి లో పోటీ చేయడానికి ఓ కారణం ఉంది. మీకు ఎం కావాలో నేను చెపిస్తా. వచ్చే టర్మ్ లో నెలకు ఒక్కపూట గజ్వెల్ నియోజకవర్గంలొనే ఉంటా….మీతోనే గడుపుతా. అన్ని మండలాల్లో మండల కార్యాలయాలు ఓపెన్ చేసుకున్నాం.’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

Latest News

More Articles