Saturday, May 18, 2024

గజ్వెల్ లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్.. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్

spot_img

హైదరాబాద్: దేశానికి రోల్ మోడల్ గజ్వెల్ నియోజక వర్గమని, అక్కడివాకి ఉత్సాహం చుస్తుంటే రాబోయే ఎన్నికల్లో కొత్త చరిత్ర సృష్టిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వెల్ నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ తోపాటు పాల్గొని మాట్లాడారు. మిషన్ భగీరథ ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

Also Read.. అభివృద్ధి అగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి.. 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నాం

‘‘ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పునరుద్ధరణ చేసిన అడవులు, మిషన్ భగీరథ కార్యక్రమం చూసేందుకు ఇవాళ దేశంలో అనేక మంది గజ్వెల్ వస్తున్నారు. ఇవాళ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాము. గజ్వెల్ కు రైల్వే స్టేషన్ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది. ప్రభుత్వ హాస్పిటల్ లు ఇప్పుడు గజ్వెల్ లో నిర్మాణం చేసుకున్నాము. దానితో ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లడం లేదు.

Also Read.. 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి పనులు.. 10 ఏండ్లలో పూర్తిచేశాం

ఇవాళ కూడవెళ్లి వాగు,హల్దీ వాగు నిండు కుండల్లా నీళ్లు ఎప్పుడు ఉంటున్నాయి. ఇవాళ 3500 కోట్ల రూపాయల వడ్లు పండిస్తున్నారు. నాడు నీళ్ల కోసం ఖాళీ బిందలతో ధర్నాలు చేసేవారు. గజ్వెల్ కు ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పారు.. ఇవాళ ఇచ్చి చూపారు. ఏ కార్యక్రమం అయిన గజ్వెల్ లో చేసి ఇవాళ రాష్ట్రం అంత అమలు చేశారు. దయచేసి ఇంత బాగా చేసిన కేసీఆర్ ఋణం తీర్చుకోవాలి అంటే రాష్ట్రంలో అతి ఎక్కువ మెజారిటీ తో గెలిపించాలని కోరుతున్న.

Also Read.. కేసీఆర్ నాయ‌క‌త్వ‌మే రాష్ట్రానికి శ్రీరామ ర‌క్ష

ఇవాళ అనేక గ్రామాల్లో మూకుమ్మడిగా మా ఓటు కారు కు, కేసీఆర్ కు అంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. రానున్న 35 రోజులు బాగా కష్టపడి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం. గజ్వెల్ లో ఎవరు గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది. గజ్వెల్ లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్, రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా.’’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Latest News

More Articles