Friday, May 17, 2024

50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసింది?

spot_img

కరీంనగర్: దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మానకొండూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. పోటీలో ఉన్న ఎమ్మెల్యే వెనుక ఉన్న పార్టీ అధికారంలోకి వస్తదని చెప్పారు. కాబట్టి బాగా ఆలోచించి ఆచీతూచీ ఓటేయాలని సూచించారు.

అభ్యర్థుల వెనుకున్న పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలె. బీఆర్‌ఎస్‌ పార్టీ చరిత్ర ఏందో మీకు తెలుసు. బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. అది మీ అందరికి తెలుసు. మీరు చూసిన చరిత్రే ఇదంతా. తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంత బాగా అభివృద్ధి చేసిందో మీరందరూ చూస్తున్నరు. మరి 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసింది.?  అడుగడుగునా తెలంగాణను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసిన కరువు కాటకాలే ఉండె. పత్తికాయలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి చనిపోయిండ్రు. అదీ కాంగ్రెస్‌ పరిపాలన అని సీఎం వివరించారు. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది.. ఏ పార్టీకి ఓటేస్తే చెడు జరుగుతది..? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయగలగాలె. ప్రజలకు ఉన్న ఒకే ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలె అని సీఎం కేసీఆర్ కోరారు.

Latest News

More Articles