పెద్దపల్లి : మంచిర్యాల జిల్లాలో తన పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తుండగా, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగారు. గోదావరిఖని బ్రిడ్జి వద్ద గోదావరి నదికి సీఎం కేసీఆర్ హారతి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, దివాకర్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మంచిర్యాల పర్యటనలో భాగంగా ఆ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కేసీఆర్ ప్రారంభించారు. రెండో విడుత గొర్రెల పంపిణీ, కులవృత్తులకు లక్ష రూపాయాల ఆర్థిక సాయం, గృహలక్ష్మీ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు.