Friday, May 17, 2024

దివ్యాంగుల పెన్షన్ పెంపు పట్ల మంత్రి కొప్పుల హర్షం

spot_img

హైదరాబాద్: దివ్యాంగులకు పింఛన్ల పెంపు నిర్ణయం పట్ల రాష్ట్ర ఎస్సి సంక్షేమ, దివ్యాంగుల  శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపు కుంటున్న తరుణంలో దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెల ఇస్తున్న 3016 రూపాయల పెన్షను ను మరో వెయ్యి రూపాయలు పెంచడం గొప్ప నిర్ణయం అన్నారు.

శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన 5,16,890 మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ. 3,016 చొప్పున పదేళ్ళలో 10310.36 కోట్ల రూపాయలను వారికి పింఛన్ల రూపంలో ఇప్పటి వరకు అందించడం జరుగుతుందని చెప్పారు. వచ్చే నెల నుంచి ప్రతీ దివ్యంగులకు 4116 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు.

ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ దివ్యంగులను అక్కడి ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏ రంగం లోనూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు అమలు కావడం లేదు అన్నారు.  దివ్యాంగులు అందరితో సమానంగా ఎదగాలి అన్నదే ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పై విమర్శలు చేయడం గొప్ప కాదు.. అభివృద్ధి విషయం లో పోటీ పడే దమ్ము బిజెపి నేతలకు ఉందా అని ప్రశ్నించ్చారు.

Latest News

More Articles