Thursday, May 16, 2024

నిర్మ‌ల్ చేరుకున్న సీఎం కేసీఆర్

spot_img

హైద‌రాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్మ‌ల్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ నేరుగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కేసీఆర్ వెంట మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు.

సీఎం కేసీఆర్ కు తన కుటుంబ సభ్యులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిచయం చేశారు. అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంట్లో సీఎం కేసీఆర్ కు మంగళహారతి తో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీమణి, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.

మ‌రికాసేప‌ట్లో నిర్మ‌ల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు భ‌వ‌నాన్ని పారంభించనున్నారు. అనంతరం నిర్మల్‌ రూరల్‌ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో కొత్త కలెక్టరేట్‌ను కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం ఎల్ల‌ప‌ల్లిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.

Latest News

More Articles