గత కొన్ని రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం కేసీఆర్.. నేడు సిద్దిపేట జిల్లాలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారిని ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్రావు సూచన మేరకు స్థానిక నేతలు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. ఈసారి వరుస బీఆర్ఎస్ సభలు.. మధ్యలో యాగం, సమయాభావ పరిస్థితులతో ముందుగానే ఈ ఆలయంలో పూజలు చేయనున్నారు. తన నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో పెట్టి పూజలు చేస్తారు. ఈ నెల 9న గజ్వేల్తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదేరోజు బీఆర్ఎస్ ఆశీర్వాదసభల్లో పాల్గొననున్నారు.
Read Also: రాష్ట్రంలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్
కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం సీఎం కేసీఆర్, పార్టీకి సెంటిమెంట్గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ నామినేషన్ వే స్తారు. సీఎం కేసీఆర్, హరీశ్రావు , ఇతర పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శనం చేసుకొని స్వా మివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్ కేసీఆర్కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు. మరో విశేషం ఏమిటంటే, 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్.. ఆ తర్వాత ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు.
Read Also: నేను తల్లిని కావాలి.. నా భర్తను 15 రోజులు జైలు నుంచి విడుదల చేయండి..