తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ నెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతం వస్తున్న బలమైన తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నాగర్కర్నూలు, వనపర్తి, జోగులాంబ-గద్వాల్, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Read Also: నేను తల్లిని కావాలి.. నా భర్తను 15 రోజులు జైలు నుంచి విడుదల చేయండి..
కాగా.. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. పగలు ఎండలు మండిపోతుండగా, రాత్రిళ్లు, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోతున్నాయి.