Saturday, May 18, 2024

అర్ధరాత్రి కాంగ్రెస్‌ అరాచకం..మల్లాపురంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేత

spot_img

రాష్ట్రంలో కాంగ్రెస్‌ గుండాల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్‌ శ్రేణుల పై దాడులకు పాల్పడుతోంది. లేటెస్టుగా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కూల్చివేశారు. 100 పోలీసుల పహారాతో జేసీబీతో నేలమట్టం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి పేరుతో రెండేండ్ల క్రితం 150 గజాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. అయితే అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దురాగాతాలకు ఒడిగడుతున్నాడు.

బీఆర్‌ఎస్‌పై దాడులకు పాల్పడుతూ గ్రామాల్లో భయాందోళన కలిగించేలా వాతావరణం సృష్టిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏప్రిల్ మొదటి వారంలో.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు

Latest News

More Articles