Saturday, May 4, 2024

చైనాలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు: 47 మంది స‌జీవ స‌మాధి

spot_img

చైనాలో తీవ్ర విషాదం జరిగింది. యునాన్ ప్రావిన్స్ లోని గిరిజ‌న‌, ప‌ర్వ‌త ప్రాంతాల్లోని కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో 47 మంది స‌జీవ‌స‌మాధి అయ్యారు. ఈ ఘ‌ట‌న ఇవాళ(సోమ‌వారం) తెల్ల‌వారుజామున 5:51 గంట‌ల స‌మ‌యంలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, విప‌త్తు ద‌ళాలు క‌లిసి స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టాయి. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో 18 ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. ఆ నివాసాల్లో 200 మందికి పైగా నివాసం ఉంటున్నారు. అయితే విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌ల‌ను తొల‌గిస్తున్నారు. శిథిలాల కింద ఉన్న మృత‌దేహాల‌ను వెలికి తీస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో 200 మంది పాల్గొన్నారు. గాయ‌ప‌డ్డ వారిని స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు.

ఇది కూడా చదవండి: ఏప్రిల్ మొదటి వారంలో.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు

Latest News

More Articles