Friday, May 17, 2024

ఈవీఎం కమిషనింగ్ పూర్తి. 49 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లు

spot_img

హైదరాబాద్: ఈవీఎం కమిషనింగ్ మొత్తం పూర్తయిందని, ఈవీఎంల పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. హోం ఓటింగ్(26 వేలు ఓట్లు) పూర్తయిందన్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ కోసం 1 లక్ష 65వేలు ఆమోదించగా.. ఇప్పటి వరకు 95వేలు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. 54 లక్షల 13 వేల ఎపిక్ కార్డుల ప్రింటింగ్ పూర్తయిందని.. పంపిణి జరుగుతోందన్నారు.

2290 మొత్తం అభ్యర్థుల్లో 221 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 49 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. రంగారెడ్డి – 4, హైదరాబాద్ 14, ఒక్కో జిల్లాలో ఒక్కొకటిచొప్పున ఉన్నాయి. 2.5 లక్షల సిబ్బంది వరకు డిప్లాయ్మెంట్ అయింది. 45 వేల మంది తెలంగాణ పోలీసులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీసులు విధుల్లోకి వస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర వీల్ చైర్, ఒక సిబ్బంది ఉంటారు. 80 వేల వీల్ చైర్ జిల్లాలకు పంపినట్లు తెలిపారు.

375 కేంద్ర బలగాల కంపెనీలు వచ్చాయి. 24 వేల మంది హోం గార్డులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. 72, 48 గంటల ముందు కఠినమైన నిబంధనలు ఉంటాయి. 48 గంటల ముందు నుంచే 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 48 గంటల ముందే స్థానికేతరులు బయటకు వెళ్లిపోవాలి. సైలెంట్ పీరియడ్ లో టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు అనుమతి లేదన్నారు.

ఆదివారం వరకు 709 కోట్ల సొమ్ము సీజ్. 290 కోట్ల వరకు నగదు ఉంది. ఎంసీసీ లో 1025 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 120 లింక్స్ ను ఫిర్యాదులు వచ్చినందుకు డిలీట్ చేసాము. సువిధ యాప్ ద్వారా 41 వేల అనుమతులు ఇచ్చాం. 7626 ఫిర్యాదులు C – విజిల్ ద్వారా వచ్చాయి. కాల్ సెంటర్ కు 44282 జిల్లాలో, స్టేట్ లెవల్ 2500 కాల్స్ వచ్చాయి. కాల్ సెంటర్లలో 500 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు.

12 వేల క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ, వెబ్ కాస్టింగ్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Latest News

More Articles