Friday, May 17, 2024

భార్యపై గ్యాంగ్ రేప్.. అవమానంతో భార్యభర్త సూసైడ్: అనాథలైన ముగ్గురు పిల్లలు

spot_img

వారిద్దరిది చూడచక్కని జంట. ఆ జంటకు ముద్దొచ్చే ముగ్గురు పిల్లలు. మొత్తంగా అదో చూడచక్కని కుటుంబం. అయితే ఎవరి దిష్టి తగిలిందో కానీ కామాంధుల వల్ల ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆ ఇంటి ఇల్లాలు మీద అత్యాచారం చేశారు. అవమానం భరించలేక.. భార్యభర్తలిద్దరూ తనువు చాలించారు. ఈ విషాద ఘటన డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకునే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

Read Also: 21 కేజీల లడ్డూ ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్ స్టూడెంట్స్

బస్తీ జిల్లాలోని రుధౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబంలో భార్యభర్తలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గత బుధవారం సెప్టెంబర్ 20న ఇద్దరు దుండగులు వారింట్లోకి చొరబడ్డారు. 30 ఏళ్ల భర్త మీద దాడి చేసి, 27 ఏళ్ల భార్య మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని అవమానంగా భావించిన భార్యాభర్తలు తీవ్రంగా కలత చెందారు. శుక్రవారం ఉదయం ఎనిమిది, ఆరేళ్ల వయసున్న పిల్లల్ని స్కూల్ కు పంపిన తర్వాత ఏడాది వయసున్న కొడుకుని ఇంట్లోనే వదిలి.. విషం తాగారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు దంపతులు నిందితుల పేర్లను వెల్లడిస్తూ వీడియోను రికార్డ్ చేశారు. గమనించిన కుటుంబసభ్యలు వారిద్దరినీ వెంటనే గోరఖ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించగా.. అదే రోజు రాత్రి భర్త మరణించాడు. చికిత్స పొందుతూ భార్య మరుసటి రోజు కన్నుమూసింది.

Read Also: తిరుమలలో శ్రీవారి ఉచిత బస్సు చోరీ

మృతుల బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆదర్శ్ (25), త్రిలోకి (45)లను నిందితులుగా గుర్తించి, అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బస్తీ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోపాల్ కృష్ణ తెలిపారు. నిందితులపై సెక్షన్లు 376 డి (గ్యాంగ్ రేప్) మరియు 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు..

Latest News

More Articles