అత్తపై కోపంతో కోడలు కత్తితో దాడి చేసింది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డిజిల్లా శంషాబాద్ మండలం చౌదరిగూడలో ఆదివారం జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాలతో అత్త అనురాధపై కోడలు అంబిక కత్తితో దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన అనురాధను హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సీనియర్ నేత కుమార్తెపై కేసు నమోదు