Monday, May 6, 2024

ఎవరు ద్రోహులో అసెంబ్లీలో తేల్చుకుందాం

spot_img

నల్లగొండ జిల్లా : సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కృష్ణా ప్రాజెక్ట్ లను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చెప్పు దెబ్బలు కొట్టడం ఖాయమన్నారు. తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్.. కేసీఆర్ పై ఎదురు దాడికి దిగుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీ పడి ప్రాజెక్ట్ లను అప్పగించారు.  కేసీఆర్ మాట్లాడక ముందే కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు.

కృష్ణా జలాల విషయంలో ప్రాజెక్ట్ లు అప్పగించి కాంగ్రెస్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు.  తెలంగాణకు అసలైన ద్రోహులు కాంగ్రెస్, బీజేపీలు అని అన్నారు.  కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని, ఎవరు ద్రోహులో తేల్చుకుందామని సవాల్ విసిరారు. కేంద్రానికి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రేవంత్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read.. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి నైట్ పార్టీలు..!

Latest News

More Articles