Monday, May 6, 2024

అసెంబ్లీలో పూలే విగ్రహానికై 12న మహాధర్నా.. జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు

spot_img

హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు పోరు మొదలైంది. ఈ నెల 12వ తేదీన భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్ లో ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నాయి. రాజకీయ పార్టీలకు, బీసీ సంఘాలకు, మెధావులు, ప్రొఫెసర్లు ధర్నాలో పాల్గొనాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

దీనితోపాటు ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరగనున్నాయి. 6న తేదీన ఉదయం వరంగల్ లో.. మధ్యాహ్నం కరీంనగర్ లో సమావేశాలు జరుగుతాయి. 7వ తేదీన వికారాబాద్(ఉదయం), మహబూబ్ నగర్(మధ్యాహ్నం), 8వ తేదీన ఆదిలాబాద్(ఉదయం), నిజామాబాద్ (మధ్యాహ్నం), 9వ తేదీన ఖమ్మం(ఉదయం), నల్గొండ(మధ్యాహ్నం), 10వ తేదీన సంగారెడ్డిలో ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి.

Also Read.. ఎన్నో బెదిరింపులు వచ్చాయి..అయినా భయపడలేదు

Latest News

More Articles