Sunday, May 19, 2024

ముగిసిన మూడో రోజు ఆట.. 332 పరుగులు ఆధిక్యంలో భారత్

spot_img

భారత్-ఇంగ్లాండ్ మద్య విశాఖపట్నంలో వేదిక‌గా జ‌ర‌గుతున్న‌ రెండో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌‌లో టీమిండియా 396 (ఆలౌట్) పరుగులు చేయగా.. ఓవర్‌ నైట్‌ స్కోరు 28/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 255 (ఆలౌట్) పరుగులు చేసింది భారత్.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 253 (ఆలౌట్) చేయగా., ఇవ్వాల భారత్ ఆలౌట్ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. స్టంప్స్ తీసే సమయానికి 14 ఓవర్లలో 67/1 స్కోరు చేసింది. ప్రస్తుతం క్రీజులో జాక్‌ క్రాలే (29), రెహాన్ అహ్మద్ (9) ఉన్నారు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్‌ బెన్‌ డకెట్ (28) ఔట్‌ అయ్యాడు.

ఇంగ్లాండ్ 332 పరుగులు వెనకబడి ఉంది.భారత్‌కు 9 వికెట్లు కావాలి. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 17, గిల్ 104, శ్రేయస్ అయ్యర్ 29, అక్షర్ 45, అశ్విన్ 29 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రెండో ఇన్నింగ్స్‌లో టామ్ హార్ట్‌లీ 4, రెహాన్ అహ్మద్ 3, జేమ్స్ ఆండర్సన్ 2, షోయబ్ బషీర్ 1 వికెట్ తీశారు.

ఇది కూడా చదవండి: ఎవరు ద్రోహులో అసెంబ్లీలో తేల్చుకుందాం

Latest News

More Articles