Monday, May 20, 2024

అత్తను ఆస్పత్రికి తీసుకొస్తున్న కోడలిపై అత్యాచారం

spot_img

ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. అత్తను ఆస్పత్రికి తీసుకొస్తున్న కోడలిపై అత్యాచారం జరగడంతో, అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. వరంగల్ జిల్లా చెన్నారవు పేట (మం) రామన్న గుట్ట తండాకు చెందిన నీల.. తన అత్తకు వైద్యం చేయించేందుకు ఖమ్మంలోని ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఆస్పత్రి బయట ఉన్న నీలను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఏప్రిల్ 27న కిడ్నాప్ చేసి.. ఏప్రిల్ 28న ఉదయం 10 గంటల సమయంలో ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వదిలేశారు. గమనించిన ఆస్పత్రి సిబ్బంది.. నీలకు వైద్యం అందించారు. కానీ, పరిస్థితి విషమించడంతో.. నీల అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతిచెందింది. కాగా.. అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచారు. చుట్టుపక్కల వారి సమాచారంతో.. ఈ రోజు పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ గణేష్ తెలిపారు.

Latest News

More Articles