ఓ పన్నేండు ఏండ్ల బాలుడు ఏకంగా సీఎంనే చంపేస్తానంటూ బెదిరింపు కాల్ చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. బుధవారం సాయంత్రం కేరళ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే పోలీసుల హడావిడి మొదలైంది. ఎందుకంటే ఆ ఫోన్ కాల్ సారాంశం ఏంటంటే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను చంపేస్తానని. దాంతో అప్రమత్తమైన పోలీసు శాఖ వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో ఆ ఫోన్ చేసింది ఓ మైనర్ బాలుడని వెల్లడైంది. ఎర్నాకులంకు చెందిన 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడు హత్య బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. అయితే, బాలుడు అనుకోకుండా కంట్రోల్ రూమ్కు ఫోన్చేసినట్లు అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
Read Also: కాంగ్రెస్లో ఎవడికి వాడు నేనే సీఎం అంటున్నడు.. అందరూ చిల్లరగాళ్లే