Tuesday, May 7, 2024

కొడుకు టికెట్, తన స్వార్థం కోసమే పార్టీ మారిండు.. మైనంపల్లిపై హరీష్ రావు ఫైర్

spot_img

హైదరాబాద్: మల్కాజిగిరి ఎన్నిక మంచి మనిషి మనసున్న మనిషి ప్రజాసేవ చేయాలని అనుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డికి, మాటలు ముఠాల మనిషి మైనంపల్లికి మధ్య జరుగుతున్న ఎన్నిక.. చెడుకు మంచికి జరుగుతున్న ఎన్నిక.. చెడు మీద మంచి గెలుస్తుంది.. మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుస్తాడని మంత్రి హరీష్ రావు అన్నారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. అనుమానమే లేదు.. మళ్ళీ అధికారంలోకి వస్తాము

కొడుకు టికెట్, తన స్వార్థం కోసం పార్టీ మారిండు మైనంపల్లి అని విమర్శించారు. అతి చేస్తే రెండు పోతాయన్నారు. మెదక్ లో మల్కాజిగిరి లో ఓటమి ఖాయమని, మైనంపల్లి గెలిచినంక నియోజకవర్గంలో ఏనాడు తిరగలేదన్నారు. సీఎం కేసీఆర్ 200 ఉన్న పింఛన్ ని 2000 చేశారు. ప్రభుత్వం ఏర్పడగానే 5వేలు అవుతాయి. సన్న బియ్యం వస్తాయి. సౌభాగ్య లక్ష్మీ కింద మహిళలకు 3 వేలు ఇస్తాము. ప్రభుత్వం ఏర్పడగానే 400 కె సిలిండర్ అందజేస్తం. సంపద పెంచాలి పేదలకు పంచాలి అన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని వివరించారు.

Also Read.. జేఈఈ మెయిన్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల

ఇంటింటికి మంచి నీళ్ళు అందిస్తున్నాము. నీళ్ల గోస తప్పింది. 24 గంటల కరెంట్ అందిస్తున్నము. పదేళ్లలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదు. కళ్యాణలక్ష్మి కింద లక్ష నూట పదహార్లు అందిస్తున్నాము. రైతు బీమా ఏడేళ్ల నుండి అమలు చేస్తున్నము.. కోటి మందికి కేసీఆర్ బీమా ప్రవేశ పెడుతున్నము. కాంగ్రెస్ వాళ్లు గోబెల్స్  ప్రచారం చేస్తున్నారు. కర్ణాటకలో కేవలం 5 గంటలు కరెంట్ ఇస్తున్నారు. మనం అగమైతే తెలంగాణ 20 ఏళ్ళు వెనక్కి పోతుందని హెచ్చరించారు.

Also Read.. రేవంత్ కు షాక్.. గాంధీభవన్ లో ఫ్లెక్సీలు కాల్చివేత

అన్నిట్లో మనం నంబర్ వన్ ఉన్నాము. తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతుంది. కేసీఆర్ కి దయాగుణం ఉన్నది. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే గుణం  ఉన్నది. రాహుల్ గాంధీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. మల్కాజిగిరిలో 1000 పడకల ఆసుపత్రి తయారు అవుతుంది. ఇంకో ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. 250 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కూడా అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుందన్నారు.

Also Read.. కాంగ్రెస్‎లో ఎవడికి వాడు నేనే సీఎం అంటున్నడు.. అందరూ చిల్లరగాళ్లే

చెరువులను అభివృద్ధి చేస్తాం. తాను బాధ్యత తీసుకుని నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తాను. గుండా రాజ్యాన్ని పారదోలండి మంచి మనిషిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆపద మొక్కులు, ఓట్లు తప్ప మైనంపల్లి ది ఎం లేదు. అన్ని సర్వేలు 75 నుండి 80 సీట్లలో కేసీఆర్ గెలుస్తున్నారని ప్రకటించాయి. కాంగ్రెస్ వస్తే కుర్చీల కోసం కొట్లాడుతారు. సన్నీ డియోల్, రజనీకాంత్ హైదరాబాద్ వచ్చి విదేశాల్లో ఉన్నామా అని ఆశ్చర్యపోయారు. కేసీఆర్ రావాలని ప్రజలు అందరు కోరుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముస్లింలకు బడ్జెట్ కేటాయించాము. మర్రి రాజశేఖర్ రెడ్డి ని లక్ష మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

Latest News

More Articles