Saturday, May 18, 2024

కాగితాల్లోనే ‘ఢిల్లీ మద్యం’ అవినీతి.. ఆధారాలెక్కడ? ఈడీని నిలదీసిన న్యాయస్థానం

spot_img

హైదరాబాద్‌: ‘ఢిల్లీ మద్యం పాలసీ’లో అసలు కుంభకోణం అంతా భోగస్ అని మరోసారి తేలింది. కాగితాల్లోనే ‘ఢిల్లీ మద్యం’ అవినీతి కనిపిస్తోందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని ఢిల్లీలోని రౌస్‌అవెన్యూ కోర్టు నిలదీసింది. ఈ కేసులో సాక్ష్యాధారాలే కనిపించడం లేదని,  దర్యాప్తు విధానంపై కోర్టు అసహనం వ్యక్తంచేసింది.

అప్రూవర్‌ చెప్పినదాన్నే ఆధారంగా చేసుకొని విచారణ జరపడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వంద కోట్ల అక్రమాలు అని చెబుతున్న ఈడీ.. నగదును మాత్రం లక్షల్లోనే చూపించడంపై న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ విస్మయం వ్యక్తంచేశారు. ఈ కేసుకు సంబంధించి శనివారం రాజేశ్‌ జోషి, వ్యాపారవేత్త గౌతమ్‌ మల్హోత్రాకు బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించారు.

Latest News

More Articles