న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. బిలాస్పూర్ ఏరియాలో ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించిందని పేర్కొంది. ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి సమాచారం అందాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Also Read… నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్రామ్ ‘డెవిల్’