పంజాబ్ లోని జల్పాయ్ గురి జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. స్కూటీని ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందగా..తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి శనివారం రాత్రి భార్య, తన ఎనిమిదేళ్ల కొడుకుతో కలిసి ఓ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యాడు. పార్టీ అనంతరం అర్ధరాత్రి తర్వాత ముగ్గురూ కలిసి స్కూటీపై జల్పాయ్గురికి తిరుగు ప్రయాణం అయ్యారు.
Also Read.. చైనాకు ఎదురుదెబ్బ.. తైవాన్ ప్రెసిడెంట్గా విలియం లై షింగ్!
31వ నెంబర్ జాతీయ రహదారిపై గల దుస్ దర్గా ఏరియాకు రాగానే వెనుక నుంచి వచ్చిన ట్రక్కు బలంగా వారి స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగమంచు ఉండటంతో కనిపించక అనేక వాహనాలు వారిపైనుంచి వెళ్లాయి. స్థానికులు గమనించి వాహనాలను ఆపారు. రక్తపు మడుగులో పడివున్న ముగ్గురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా… తండ్రీకొడుకు అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.