Friday, May 17, 2024

తొందరగా కోలుకో రిషభ్‌.. క్రికెటర్ల భావోద్వేగ వీడియో

spot_img

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న స్టార్‌ బ్యాటర్ రిషభ్‌ పంత్‌ త్వరగా కోలుకోవాలని ప్రముఖ క్రికెటర్లందరూ భావోద్వేగ వీడియోను చేశారు.

ఈ వీడియోలో భారత జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, హార్దిక్‌ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌, చాహల్, ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌.. పంత్‌ త్వరగా కోలుకొని తిరిగి ఆట ప్రారంభించాలని కోరుతూ భావోద్వేగానికి గురయ్యారు.

క్రికెటర్ల భావోద్వేగ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ హ్యాండిల్ లో అభిమానుల కోసం పంచుకున్నది. ‘రిషభ్‌ నువ్వు త్వరగా కోలుకోవాలి. మన జట్టు, దేశం మొత్తం నీ వెనక ఉంది. నువ్వు ఒక ఫైటర్‌వి. కచ్చితంగా నువ్వు త్వరగా కోలుకొని తిరిగి వస్తావు.’’ అని క్రికెటర్లు వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇన్ఫెక్షన్‌ సోకకుండా అతడిని ప్రైవేటు వార్డుకు మార్చారు. ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉన్నందున పంత్‌ని కలవడానికి బంధువులను, సెలబ్రెటీలను అనుమతించట్లేదని డీడీసీఏ డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ తెలిపిన విషయం తెలిసిందే.

నూతన సంవత్సర వేళ కుటుంబ సభ్యులకు సప్రైజ్‌ ఇవ్వాలని ఇటీవల రూర్కీ బయలుదేరిన పంత్‌ నార్సన్‌ సరిహద్దు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Latest News

More Articles