సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేపటి నుంచి హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలో జాతీయ హస్తకళల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనను 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు. జనవరి 18వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.
జాతీయ హస్తకళల ప్రదర్శనలో చెక్కబొమ్మలు, హస్తకళలు, నీలం కుండలు, వెదురు, జనపనార ఉత్పత్తులతో పాటు అనేక రకాల క్రాఫ్ట్ వస్తువులను ప్రదర్శించనున్నారు. ఇక ప్రతి రోజు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.