కరీంనగర్ జిల్లా: ఎన్నికలకు ముందు ఈటల రాజేందర్ కు తన అభిమానులు భారీ షాకిచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ మండలాలకు చెందిన బిజెపి విద్యార్థి నాయకులు, ఎమ్మెల్లే ఈటెల అనుచరులు బిజేపి పార్టికి రాజీనామ చేశారు.
Also Read.. సీఎం కేసీఆర్ సెక్రటరీ తల్లి మృతి.. హరీష్ రావు పరామర్శ
జమ్మికుంట పట్టణంలోని స్ధానిక అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. బిజేపి పార్టీలో ఇమడలేక పోతున్నామని , ఈటెల కు వ్యతిరేకంగా పార్టీకి రాజీనామ చేసినట్లు విద్యార్థి సంఘ నాయకుడు జువాజి కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమములో విద్యార్ధి నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.