మహబూబాబాద్ జిల్లా : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వరి రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లను కొనుగోలు చేయాలంటూ రైతులు ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు, మార్కెట్ ఆధికారులకు మధ్య తోపులాట ఘర్షణ జరిగింది. వ్యవసాయ మార్కెట్ ఆధికారుల పని తీరు పై రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పంటకు ఎందుకు గిట్టుబాటు ధర తగ్గించారు అంటూ రైతులు మండిపడ్డారు. మార్కెట్ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. కార్యాలయం ఎదుట బైటాయించారు.