ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ కు చేరింది.ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్స్ కావడంతో క్రికెట్ అభిమానులే కాదు.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ మ్యాచ్కు స్వయంగా హాజరై చూసేందుకు అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనల్స్ పై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ వంద శాతం గెలుస్తుందని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్: 2 లక్షలు దాటిన హోటల్ రూం టారిఫ్లు
బుధవారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైన్సల్ మ్యాచ్ను రజినీకాంత్ వాంఖడే స్టేడియంలో స్వయంగా కుటుంబ సమేతంగా చూశారు. ఆ తర్వాత చెన్నై చేరుకున్న సూపర్ స్టార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫైనల్స్ లో భారత్ గెలుపు ఖాయమని.. ఈ సారి వరల్డ్ కప్ మనదేనని ధీమా వ్యక్తం చేశారు రజినీకాంత్.
100 per cent sure India will win World Cup 2023: Rajinikanth
Read @ANI Story | https://t.co/4kleX031Un#Rajnikanth #India #WorldCup2023 #CricketWorldCup2023 pic.twitter.com/lB1cKZFq7Q
— ANI Digital (@ani_digital) November 16, 2023