Saturday, May 18, 2024

ఈ సారి వంద శాతం వరల్డ్ కప్ మనదే

spot_img

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ కు చేరింది.ఆదివారం (నవంబర్‌ 19) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఫైనల్స్‌ కావడంతో క్రికెట్‌ అభిమానులే కాదు.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు స్వయంగా హాజరై చూసేందుకు అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనల్స్ పై తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ వంద శాతం గెలుస్తుందని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: భార‌త్‌, ఆస్ట్రేలియా ఫైన‌ల్ మ్యాచ్‌: 2 ల‌క్ష‌లు దాటిన హోట‌ల్ రూం టారిఫ్‌లు

బుధవారం భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన సెమీఫైన్సల్‌ మ్యాచ్‌ను రజినీకాంత్‌ వాంఖడే స్టేడియంలో స్వయంగా కుటుంబ సమేతంగా చూశారు. ఆ తర్వాత చెన్నై చేరుకున్న సూపర్‌ స్టార్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫైనల్స్ లో భారత్‌ గెలుపు ఖాయమని.. ఈ సారి వరల్డ్ కప్ మనదేనని ధీమా వ్యక్తం చేశారు రజినీకాంత్.

Latest News

More Articles