హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యారని సనత్ నగర్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం అమీర్ పేట డివిజన్ శ్రీరాం నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
Also Read.. ఈ సారి వంద శాతం వరల్డ్ కప్ మనదే
సనత్ నగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రం అత్యధిక ఆదాయం పొందుతుందని, అయినా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతుందని ఆరోపించారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు.