Saturday, May 18, 2024

ఓట్ల పండుగలో ఓటేసిన సినీ ప్రముఖులు

spot_img

హైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సినీ ప్రముఖులు ఓటేసేందుకు పోటెత్తారు. సాధారణ పౌరుల్లా క్యూలో నిల్చొని మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలలో టాలీవుడ్‌ స్టార్స్‌ రామ్‌ చరణ్‌ – ఉపాసన, మహేశ్‌ బాబు – నమ్రత దంపతులు ఓటు వేశారు. ప్రముఖ సీనియర్‌ నటుడు బ్రహ్మానందం, రాజశేఖర్‌, రామ్‌, స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అంతా తమ విలువైన ఓటును వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Latest News

More Articles