ఉత్తర ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది.దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం చెలరేగింది. ఇవాళ(శుక్రవారం) ఆఫీస్ ఆరో అంతస్తులోని ఓ గదిలో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. తర్వాత కూలింగ్ ప్రాసెస్ నిర్వహించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఈనెల 20, 21 తేదీలలో ఓటర్ నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్