హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్డీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ములుగు – హనుమకొండ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి.
Also Read.. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో ఆలస్యం ఎందుకు?
ఈ ప్రమాదంలో ఆర్డీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సును ఢీకొని ఆయిల్ ట్యాంకర్ లోయలో పడిపోయింది. ములుగు నుంచి హనుమకొండకు ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు స్పల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.