Sunday, May 5, 2024

హనుమకొండ జిల్లాలో ఆర్డీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ

spot_img

హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్డీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ములుగు – హనుమకొండ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్నాయి.

Also Read.. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణలో ఆలస్యం ఎందుకు?

ఈ ప్రమాదంలో ఆర్డీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సును ఢీకొని ఆయిల్‌ ట్యాంకర్‌ లోయలో పడిపోయింది. ములుగు నుంచి హనుమకొండకు ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు స్పల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Latest News

More Articles