Friday, May 17, 2024

గుండెపోటుతో మైదానంలో కన్నుమూసిన కర్ణాటక మాజీ క్రికెటర్

spot_img

క్రికెట్ మైదానంలోనే కర్ణాటక మాజీ క్రికెటర్ కే.హోయసల గుండెపోటుతో కన్నుమూశాడు. కేవలం 34 ఏళ్ల వయసులోనే మృతి చెందాడు. ‘ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్‌’లో భాగంగా బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఐ క్రికెట్ మైదానంలో తమిళనాడు, కర్ణాటక మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విషాదం జరిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన కర్ణాటక ఆటగాళ్లు సెలబ్రేషన్స్ లో మునిగిన సమయంలో తీవ్రమైన ఛాతినొప్పితో మైదానంలోనే హోయసల కుప్పకూలాడు.

గమనించిన తోటి ఆటగాళ్లు, సిబ్బంది అంబులెన్స్‌ ద్వారా హుటాహుటిన సమీపంలో ఉన్న బౌరింగ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తీవ్ర గుండెపోటుతో గురై హోయసల మరణించినట్లు తెలుస్తోంది. పోస్ట్ మార్టం పూర్తి రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని బౌరింగ్ హాస్పిటల్, అటల్ బిహారీ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ మనోజ్ కుమార్ అన్నారు.

మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, బౌలర్‌గా అండర్-25 విభాగంలో కర్ణాటక జట్టుకు హోయసల ప్రాతినిధ్యం వహించాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు.

ఇది కూడా చదవండి: ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోం ముగిసినట్టే..ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు

Latest News

More Articles