Friday, May 17, 2024

భువనగిరి జడ్పీచైర్మన్‌పై కాంగ్రెస్‌ నేతల దౌర్జన్యం.. మండిపడ్డ హరీష్ రావు

spot_img

హైదరాబాద్: భువనగిరి జడ్పీ చైర్మన్‌ సందీప్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ నేతల దౌర్జన్యాన్ని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరిని ఆయన తప్పుబట్టారు. మొన్న రైతుబంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి.. సోమవారం అధికారిక కార్యక్రమంలో భువనగిరి జడ్పీ చైర్మన్‌ను అకారణంగా దూషించడం కాంగ్రెస్‌ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు.

అధికార వేదికపైనుంచి జెడ్పీ చైర్మన్  సందీప్‌ రెడ్డిని బలవంతంగా బయటకు పంపిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.  ప్రజాస్వామ్య వాదులంతా కోమటిరెడ్డి తీరును తీవ్రంగా ప్రతిఘటించాలని హరీష్ పిలుపునిచ్చారు. కోమటిరెడ్డికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా జడ్పీచైర్మన్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని  డిమాండ్‌ చేశారు.

Also Read.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత నర్సారెడ్డికి మీరిచ్చే గౌర‌వం ఇదేనా?

Latest News

More Articles