Monday, May 13, 2024

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత నర్సారెడ్డికి మీరిచ్చే గౌర‌వం ఇదేనా?

spot_img

హైదరాబాద్: ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి పి.న‌ర్సారెడ్డి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడాన్ని మాజీ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  తీవ్రంగా తప్పబట్టారు. అప్పటి సీఎం జలగం వెంగళరావు మంత్రివర్గంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ,  శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశార‌ని, వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఆ త‌ర్వాత ఎంపీగా  ప్ర‌జా సేవ‌లో కొనసాగిన ఆజాత శత్రువు  లాంటి న‌ర్సారెడ్డి అంత్య‌క్రియ‌ల‌ను అధికారికంగా నిర్వహించక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ  అంత్యక్రియలు జరపకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Also Read.. నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి.. జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో

Latest News

More Articles