వరంగల్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిసెంబర్ 9వ తేదీన రైతుబంధు రైతుల అకౌంట్ లో వేస్తామని చెప్పారని, ఇంకా ఎందుకు వేయలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక పూర్తిగా విపలం అవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులలోనే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై, కార్యకర్తలపైన భౌతిక దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పార్టీ కార్యకర్తలకు కష్టం వస్తే అందరం ఒకటి కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విషప్రచారం చేసి గెలిచిందని ఆరోపించారు. చిన్న చిన్న కారణాలతో ఓడిపోయామని, కార్యకర్తల సూచనలు పరిగణనలోకి తీసుకొని పార్టీని బలోపేతం చేసుకుంటామని ఆయన తెలిపారు. సోమవారం జరిగిన వర్ధన్నపేట నియోజకవర్గ విసృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపి పసునూరి దయాకర్ పాల్గొన్నారు.
Also Read… సందీప్ రెడ్డిపై దౌర్జన్యం.. కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనం