హైదరాబాద్: పాతబస్తీ తలాబ్ కట్టలో నిర్వహించిన ముస్లిం మత పెద్దల సమావేశంలో మాజీమంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన మత పెద్దలను, ముస్లిం సోదరులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అన్ని రాష్ట్రాలు, దేశంలో ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు.
Also Read.. కరీంనగర్ డిపోలో కోడిపుంజు వేలం.. అధికారుల నోటీసులు
9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో శాంతి యుతంగా ప్రజలు జీవించారని చెప్పారు. సీఎం కేసీఆర్ సెక్యులర్ లీడర్ అని, దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. గంగా జమున తెహజీబ్ సంస్కృతికి మన తెలంగాణ నిదర్శనంగా నిలిచిందన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు.