లక్నో: ఒక మహిళ తన ఆరు నెలల కుమార్తెతో కలిసి అపార్ట్మెంట్ బిల్డింగ్లోని 16వ అంతస్తు నుంచి కిందకు దూకింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. బిష్రాఖ్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని లా రెసిడెన్షియల్ సొసైటీలో జరిగిన ఈ ఘటనలో తల్లి, చిన్నారి మరణించారు.
Also Read.. న్యూఇయర్ వేళ 65 లక్షల ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతురాలిని 33 ఏళ్ల సారికగా గుర్తించారు. అనారోగ్యం వల్ల ఆమె డిప్రెషన్తో బాధపడుతోందని బంధువులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తల్లీ బిడ్డ మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.