హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో పయనమయ్యారు. దీంతో వాహనాలతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.
Also Read.. మెహబూబా ముఫ్తీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
ఈ క్రమంలో టోల్ప్లాజాల వద్ద వాహనాలు బారులుతీరాయి. ఫాస్ట్ట్యాగ్ ఉన్నా.. వాహనాలు ఎక్కువగా రావడంతో నెమ్మదిగా కదులుతున్నాయని సిబ్బంది తెలిపారు. మరోవైపు తెలంగాణ-ఏపీ బార్డర్లలో ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసి పంపిస్తుండటంతో మరింత జాప్యం జరుగుతోంది.