Sunday, May 12, 2024

రైతులకు నీళ్లు ఇచ్చి.. గతంలో ఏమన్నా తప్పులు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి

spot_img

రైతుకు కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ కొడుతోందన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రేవంత్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మెగా మోసం, వంచన చేసిందన్నారు.ఇవాళ( బుధవారం) హైదరాబాద్ తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. రైతులకు ఎకరాకు రూ.10 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తమంటే రాజకీయ గేట్లు ఎత్తాం అంటున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం. వడగండ్లవాన, అకాల వర్షాలతో పంటలు పోయి రైతులు బాధలో ఉంటే ఒక్క మంత్రి వారికి భరోసా ఇవ్వడం లేదు. గతేడాది అకాల వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్ , వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతింటే స్వయంగా నేను, కేసీఆర్ గారు పర్యటించి ధైర్యం కల్పించాం. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రకారం రూ.2000-2500 అంచనా వేసిన కూడా రైతు కన్నా మించిన వాడు లేడని ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందించాం. ఒకే రోజు రూ.1300 కోట్లు విడుదల చేశాం. తర్వాత మిగతా వాటికి అందించామన్నారు.

అప్పుడు ఎకరాకు రూ.10 వేలు బిచ్చం వేస్తున్నారా ? అని ఇదే రేవంత్, కాంగ్రెస్ నేతలు అన్నారని తెలిపారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో పంటలు ఎండిన రైతులు, అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దానికి సంబంధించిన జీఓను వెంటనే విడుదల చేయాలన్నారు. మీకు రైతుల మీద అంతలా ప్రేమ ఉంటే మాకన్నా ఎక్కువ ఇచ్చి చూపండన్నారు.

అదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలలో వేలాది ఎకరాల్లో పంటలు అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి.3.5 ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు ఇచ్చారు. 80 శాతం అంటూ అబద్దాలు చెబుతున్నారు. అడిగితే చెప్పుతో కొడతాం అంటున్నారని ఆరోపించారు. వంద రోజుల్లో వ్యవసాయాన్ని అతలాకుతలం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరంజన్ రెడ్డి. గ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయం చేసే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తే .. వద్దు ఈ వ్యవసాయం అనే పరిస్థితులు కల్పించారు కాంగ్రెస్ నేతలు.

జలాశయాల్లో ఉన్న నీళ్లను అంచనా వేసి రైతుల పంటల సాగుకు సూచన చేయమంటే ఒక్కనాడు ప్రభుత్వం  సమీక్ష చేయలేదని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. రైతులకు నీళ్లు ఇచ్చి గతంలో ఏమన్నా తప్పులు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోండన్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. కాంగ్రెస్ చర్యలను రైతులు గమనించాలి .. కాంగ్రెస్ పార్టీని నమ్మితే వచ్చిన మార్పును గమనించాలన్నారు. అప్పట్లో రైతులకు చిన్న ఇబ్బంది కలిగినా వారి దగ్గర వాలిపోయి భరోసానిచ్చాం. అన్ని మీడియాల్లో, జిల్లాలలో గంగమ్మ కోసం రైతుల గోస, పంట కాపాడుకునేందుకు రైతుల గోస, పంటను పశువులకు వదిలేసిన రైతులు అన్న వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు .. వారికి భరోసా కల్పించాలి. కానీ రాష్ట్రంలో ఒక్క మంత్రి.. ఒక్క ఎమ్మెల్యే రైతుల వైపు కన్నెత్తి చూడలేదన్నారు. కేసీఆర్ అప్పులు చేశాడని అభాండాలు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 100 రోజులకే రూ.16,400 కోట్లు అప్పు చేసింది. అప్పులు చేశారు మరి రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వ లేదు ? గుత్తేదారులకు మాత్రం బిల్లులు ఇస్తారా ? చేసిన అప్పులతో ఏం చేస్తున్నారు ? అని ప్రశ్నించారు.

కేసీఆర్ సర్కారు ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను ఒక్క నోటిఫికేషన్ వేయకుండా మేము ఇచ్చాం అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు నిరంజన్ రెడ్డి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎఓ, ఎస్ డబ్లూఓ , డీఎస్సీలో 5 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టినవే .. కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు గత ప్రభుత్వానివే .. కాంగ్రెస్ వచ్చి నియామక పత్రాలు మాత్రం ఇచ్చిందన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అని యువతకు మొండి చేయి చూపారన్నారు. గతేడాది 5 వేల టీచర్ పోస్టులు ప్రకటిస్తే .. 21 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ అన్నారు. మరి 11 వేల ఉద్యోగాలనే ఎందుకు ప్రకటించారని అడిగారు.

విద్యార్థినులకు ఎలక్ట్రిక్ బైక్ లు, యువతకు నిరుద్యోగ భృతి అని అడ్డగోలుగా అధికారం కోసం హామీలు ఇచ్చారు. యువతకు కాంగ్రెస్ చేసింది మేలు కాదు మోసం.. యువత దీనిని అర్దం చేసుకోవాలన్నారు. కానిస్టేబుళ్ల 46 జీఓను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తాం అన్నారు. ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. గ్రామాల్లో యువత దీన్ని గమనించాలన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో యువతను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నిరంజన్ రెడ్డి.

ఇది కూడా చదవండి: పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేలు నష్టపరిహారం ఇవ్వండి

Latest News

More Articles