Friday, May 3, 2024

అన్నదాతలను మోసం చేస్తున్న రాజకీయ వ్యభిచారి రేవంత్ రెడ్డి

spot_img

సీఎం గా ఎవరున్నా భాద్యతగా మాట్లాడాలన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(సోమవారం)హైదరాబాద్ లోని  తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..రేవంత్ అబద్దాలు ప్రచారాం చేస్తున్నాడు. కేసీఆర్ తెలంగాణ భవన్ లో చేసిన వ్యాఖ్యలను రేవంత్ వక్రీకరించి మాట్లాడారు. బీజేపీతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు అని కేసీఆర్ అన్నారు. గతం లో తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేసిన యత్నాలను కేసీఆర్ ఉదాహరించారు. ఓ సీనియర్ కాంగ్రెస్ నేత 20 ఎమ్మెల్యేలను తీసుకొస్తా ఆంటే వారించా అని కేసీఆర్ ఆ రోజు చెప్పారు. రేవంత్ మాత్రం ప్రతీ సభ లో కేసీఆర్ తన ప్రభుత్వానికి కూలుస్తారన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన వ్యాఖ్యలపైన ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడన్నారు పొన్నాల లక్ష్మయ్య. ఒక ఉద్యోగం ఇవ్వడానికి ఎంత టైమ్ పడుతుందో సామాన్యుడికి ఉన్న అవగాహన సీఎం కి లేదా అని ప్రశ్నించారు. గ్యారంటీలు అమలు చేయమంటే వాటి గురించి సీఎం మాట్లాడటం లేదు. జానారెడ్డి, జైపాల్ రెడ్డి లు అనుభవజ్ఞులు. వారి గురించి కూడా చులకన చేసి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి పాలన అనుభవం శూన్యం. లాగులో తొండలు అని ఎదో భాష మాట్లాడుతున్నారు. పాలన చేయమంటే పనికి రాని మాటలు చెబుతున్నాడు. దేవుండ్ల మీద ప్రమాణం చేయడం కాదు ..గతం లో చెప్పిన డెడ్ లైన్ల పై నిలబడు అని సూచించారు.

పంట నష్టం మీద ఎపుడైనా ఈ సీఎం స్పందించారా అని ప్రశ్నించారు పొన్నాల. ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వం నిజాలు దాస్తోందన్నారు. ఆయన గురించి మాట్లాడడమే నాకు సిగ్గు అనిపిస్తోందన్నారు. అన్నదాతలను మోసం చేస్తున్న రాజకీయ వ్యభిచారి రేవంత్ రెడ్డి అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చాల మంది సీఎం లను చూశాం, నిన్ను కూడా కొన్ని రోజులు చూస్తాం. అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల విగ్రహానికి  పూలమాల వేయలేదు ఈ ప్రభుత్వం.బీసీ లకు న్యాయం చేయని సీఎం.. జ్యోతి రావు ఫూలే గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు పొన్నాల లక్ష్మయ్య.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి.. పంద్రాగ‌స్టు లోపు రుణ‌మాఫీ చేయ‌క‌పోతే రాజీనామా చేస్తావా

Latest News

More Articles