Saturday, May 18, 2024

వీల్ చైర్ లో దేవెగౌడ.. కమిట్మెంట్ కి అఖిలపక్షం ఫిదా..!

spot_img

ఢిల్లీ పార్లమెంట్ లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్రం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కర్ణాటక కురువృద్ధుడు దేవెగౌడ అందరిని ఆకట్టుకున్నారు. వృద్ధాప్యం వెంటాడుతున్న చూపిస్తున్న కమిట్మెంట్ కి యువ రాజకీయవేత్తలు ఫిదా అవుతున్నారు. మొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో రాజ్యసభకి హాజరయ్యి అందరి మనసులు దోచుకుంటే నేడు ఈ మాజీ ప్రధాని దేవెగౌడ సైతం వీల్ చైర్ లో అఖిలపక్ష సమావేశానికి వచ్చారు.

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభం అయింది. ఇందులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పై సూదీర్గ చర్చ సాగింది. ఈ సమావేశానికి హాజరయిన బిఅర్ఎస్ ఎంపిలు కేశవరావు, నామా నాగేశ్వర రావులు కూడా హాజరయ్యారు. మహిళ, బిసి బిల్లుల కోసం అఖిలపక్షంలో డిమాండ్ చేయనున్నట్టు కేకే తెలిపారు. ఇక ఈ సమావేశానికి వీల్ చైర్ లో వచ్చి అందరిని ఆకట్టుకున్నారు దేవేగౌడ. ఇక కాంగ్రెస్ తరపున అధిర్ రంజన్ చౌదరి హాజరయ్యారు.

Latest News

More Articles