హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. ఉమ్మడి పాలనలో సాగునీటి ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసి తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏనాడో తిరస్కరించారని, మళ్లీ ఏ మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ నిలదీశారు.
Also Read.. కేసీఆర్ పాలనలో వృద్ధులు ఆత్మగౌరవంతో బతుకుతున్నరు
కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన తెలంగాణ ప్రజలు విశ్వసించరు. సీడబ్యూసీ సమావేశాలు పెట్టినా..ఎన్ని బహిరంగ సభలు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చోటే లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను చీరిచింతకు కట్టడం ఖాయమన్నారు.
Also Read.. చరిత్ర సృష్టించిన సిరాజ్.. 50 పరుగులకే కుప్పకూలిన లంక
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్దపడ్డ నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అలాంటి కేసీఆర్ సారధ్యంలో తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి – సంక్షేమ పథలకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.