Friday, May 17, 2024

రేవంత్, కోమటిరెడ్డిలు భయపడుతున్నరు

spot_img

హైదరాబాద్: రేవంత్, కోమటిరెడ్డిల వాఖ్యలు వారి భయానికి నిదర్శనం అని మాజీ స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. మట్టిలో కలుపుతామన్న వారు మట్టిలో కలిశారని, చీలుస్తాం అన్న వారు చీకట్లో కలిసి పోయారని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక మందిని చూసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, వైఎస్, చంద్రబాబులను చూశామని తెలిపారు. కేటీఆర్, హరీష్ లను బిల్లా- రంగాలు అంటూ ముఖ్యమంత్రి స్థాయిలో పరిణతిలేని వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో సోమవారం నల్లగొండ లోక్ సభ నియోజకవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Also Read.. తెలంగాణ పరువు తీశారు.. సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నారైల ఆగ్రహం

విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సచివాలయంలో లంకె బిందెలు అంటూ చిల్లర వ్యాఖ్యలు చేశాడని విమర్శించారు. కేసీఆర్ ఒక్కడిగా బీఆర్ఎస్ పార్టీని గ్రామం నుండి రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారని ప్రశంసించారు. పార్లమెంట్ ఎన్నికల సమీక్షలో మన అలసత్వమే మన ఓటమికి కారణం అని కార్యకర్తలు, నేతలు వెల్లడించారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టుదలగా కేసీఅర్ సూచనల మేరకు పనిచేస్తామని, పార్టీ గెలుపుకు కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు.

Latest News

More Articles