Sunday, May 19, 2024

తెలంగాణ పరువు తీశారు.. సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నారైల ఆగ్రహం

spot_img

లండన్: యూకేలో ప్రవాస సంఘాల సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడిన తీరుపై ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నారైలను ఉద్దేశించి రేవంత్ మాట్లాడిన తీరు గల్లీ కాంగ్రెస్ మీటింగ్‌లో మాట్లాడినట్టు ఉందని ఎన్నారైలు మండిపడ్డారు. రాజకీయాలకతీతంగా ప్రసంగించాల్సిన సీఎం.. బీఆర్‌ఎస్‌ను బొంద పెడుతామని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు యూకే బీఆర్ఎస్ ఎన్నారై యూకే కార్యదర్శి సతీష్ రెడ్డి గొట్టెముక్కల.

Also Read.. హిందువులతో ముస్లింల ప్రత్యేక పూజలు.. రామామందిరంలో స్పెషల్ అట్రాక్షన్

గతంలో లండన్‌కు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో హుందాగా ప్రసంగించారని గుర్తుచేశారు. నేడు సీఎం హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి.. సోయి లేకుండా గల్లీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో లాగా ప్రసంగించి తెలంగాణ పరువు తీశారని ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా గల్లీ కార్యకర్తలా మాట్లాడడం మానుకొవాలని సూచిస్తున్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని లేదంటే ఎక్కడికక్కడ నిలదీస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Latest News

More Articles