Wednesday, May 8, 2024

అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠపై చిరంజీవి ఏమన్నారంటే…?

spot_img

అయోధ్యలో నేడు రామమందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తమ కళ్ల ముందు జరుగుతున్న ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు అయోధ్యకి చేరారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్, కత్రినా కైఫ్, అలియాభట్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరవ్వగా.. రజినీకాంత్, చిరంజీవి కుటుంబం సౌత్ నుండి అయోధ్య వేడుకలను వీక్షించారు. ఇక దక్షిణభారతదేశం నుండి మెగా ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్ లతో పాటు రామ్ చరణ్ కూడా ఈ శుభ వేడుకలో పాల్గొన్నారు.

ప్రముఖ క్రీడాకారిణి పిటి ఉషతో చిరంజీవి, రామ్ చరణ్ లు ముచ్చటించారు. ఇక ప్రాణ ప్రతిష్ఠా జరుగుతున్న సమయంలో మీడియాతో ముచ్చటించారు మెగాస్టార్ చిరజీవి. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇది దేశంలోని ప్రజలందరికీ ఓ మరిచిపోలేని రోజు అన్నారు. అయోధ్య రామమందిరానికి రావడం తనకు ఓ గొప్ప అనుభూతి అన్నారు అన్నారు చిరంజీవి.

 

Latest News

More Articles